Tuesday 26 April 2016

పదోతరగతి విద్యార్థి భవిష్యత్ కోర్సు ఎంపికలోనే..

విద్యార్థి భవిష్యత్ అనేది తగిన కోర్సు ఎంపికలోనే ఉంటుంది. టెన్త్ వరకు అందరిదీ కామన్ చదువు. కానీ టెన్త్ తర్వాత పడే అడుగులు చాలా కీలకం. ఇక్కడ ఎన్నో దారులు ఉంటాయి. ఏ దారిలో వెళితే గమ్యం సరిగ్గా చేరుతామో చూసుకోవాలి. కోర్సు ఎంపికలో కింది అంశాలు బేరీజు వేసుకోవాలి.
1. విద్యార్థి అభిరుచి
2. విద్యార్థి స్థాయి (గత చదువును బట్టి అంచనా)
3. కుటుంబ పరిస్థితి (ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది చదువులను మధ్యలో మానేసిన వారు ఉన్నారు)
తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలు, అభిరుచులు కాకుండా, విద్యార్థి ఆసక్తులకు ప్రాధాన్య త ఇవ్వాలి. తల్లిదండ్రుల గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. బలవంతపు చదువులు చివరివరకు చేరవు అన్న విషయాన్ని గమనించాలి. ఒత్తిడితో కూడిన చదువులు విద్యార్థి మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.
కే. లలిత్ కుమార్, ఐఐటీ జేఈఈ ఫోరం, హైదరాబాద్

0 comments:

Post a Comment