Wednesday 27 April 2016

పది తరువాత పయనమెటు...

ప్రతి విద్యార్థికీ పదో తరగతే కీలకం.. SSC తరువాత వేసే అడుగు సోపధానమైంది. భవిష్యత్ అంతా దాదాపు నిర్ణయమైపోతుంది. ఉపాధి పొందాలన్నా.. ఉద్యోగం సంపాదించాలన్నా.. ఉన్నత స్థాయికి చేరాలన్నా ఇక్కడ తీసుకునే పునాది అవుతుంది. క్రమంలో రోజురోజుకూ పోటీ తీవ్రమవుతున్న నేటి సమాజంలో ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరితే ఏమవుతుంది..? ఇలా రకరకాల ప్రశ్నలు మదిని తొలుస్త్తుంటాయి. చాలామంది అరకొర సమాచారంతో.. విభిన్న వ్యక్తుల సలహాలతో చెందుతుంటారు. క్రమంలో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలపై అవగాహన చేసుకుని సరైన లక్ష్యం దిశగా పయనిస్తే అనుకున్న విజయాన్ని సాధించవచ్చు. 10th class తరువాత ఏమేం చేయవచ్చో తెలుసుకుందాం.


career-options-after-10th-class


ఇంటర్మీడియట్ : ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా ఇంటర్మీడియట్ అవసరం. ఇంటర్మీడియట్‌లో రకరకాల గ్రూపులు ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడం కూడా ఇంటర్మీడియట్‌లో చేరే ముందు సొంతంగా గ్రూపులను ఎంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి. 10th Class పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలా మందికి ఇంటర్‌లో ఉండే గ్రూపుల గురించి సరైన అవగాహన ఉండదు. ఏ గ్రూపులో ఏ సబ్జెక్టులు ఉంటాయో కూడా తెలియదు. అయితే ఏ గ్రూపులోనైనా చేరే ముందు ఆయా సబ్జెక్టుల వివరాలు తెలుసుకోవడంతోపాటు మనకు అందులో ప్రావీణ్యం ఉందా లేకున్నా భవిష్యత్తులో రాణించగలమా? అనే అంశాలను బేరీజు వేసుకకుని గ్రూపును నిర్ణయించుకోవాలి. 
గ్రూపులు కాంబినేషన్లు ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఎనిమిది కాంబినేషన్లలో చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కూడా ఎక్కువగా వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి. అందులో ప్రధానమైన కొన్ని గ్రూపులు ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్), ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్), హెచ్‌ఈసీ (హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్). ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాంబినేషన్ గ్రూపులు ఉన్నప్పటికీ అవి చాలా తక్కువ కళాశాలల్లో ఉన్నాయి. వీటితోపాటు అక్కడక్కడ హెచ్‌సీఎస్ (హిస్టరీ, సివిక్స్, సోషియాలజీ), హెచ్‌ఈఎం (హిస్టరీ, ఎకనామిక్స్, మ్యూజిక్), హెచ్‌ఈఎస్ (హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ), హెచ్‌సీజీ (హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ), ఈసీపీ (ఎకనమిక్స్, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) గ్రూపులు ఉన్నాయి.

వృత్తివిద్య : ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీయట్ వారధిలాంటిదైతే.. ఉపాధికి వృత్తివిద్య కోర్సులు నిచ్చెన లాంటివి. 10th Class తరువాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలు, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునేవారు సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ లాంటి గ్రూపుల్లో చేరుతారు. అయితే ఇవి కాకుండా వృత్తివిద్య కోర్సుల్లో చేరే విద్యార్థులకు మంచి ప్రయోజనం చేకూరేందుకుగాను అధికారులు ఈ వృత్తివిద్య కోర్సులకు కొత్తరూపునిచ్చారు. ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటి వరకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలు లేని ఈ కోర్సులకు ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు ముద్రించారు.

29 శిక్షణ : రాష్ట్ర స్థాయిలో tenth పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తివిద్య సంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్-ఎస్‌ఐవీఈ) వృత్తివిద్య కోర్సులను అందిస్తోంది. వృత్తివిద్య కోర్సు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలు కల్పించింది. రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారు ఎంసెట్‌కు కూడా హాజరు కావచ్చు. దీనికోసం నిర్దేశించిన బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్, కామర్స్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీలోనూ చేరవచ్చు. ప్రైవేటు కళాశాలల్లో వృత్తివిద్య కోర్సు చేసే ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం బోధనా రుసుం కూడా చెల్లిస్తుంది. 

చేరడం ఎలా..? 10th Results వెలువడిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు దీర్ఘకాలిక (రెండేళ్ల) వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఇందులో చేరేందుకు విద్యార్థులు నేరుగా జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జూలై 15వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరానికి రూ.800 ఫీజు చెల్లించాలి. రెండో సంవత్సరం విద్యార్థులు రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. 
మేళాల్లో ఉపాధి అవకాశాలు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్మీయట్ విద్యాశాఖ ఏటా జాబ్ మేళాలు, అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ మేళాల్లో ఎంపికైన వారికి మంచి వేతనంలో ఉద్యోగ అవకాశం అందిస్తుంది. 

పాలిటెక్నిక్ 10th Class తరువాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి సంపాదించాలంటే ఉత్తమ మార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి పాలిటెక్నిక్ తరువాత ఉన్నత విద్యకు అవకాశం ఉన్నా మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా ఈ పాలిటెక్నిక్ డిప్లమోపైనే ఆధారపడుతారు. ఇంజినీరింగ్ డిప్లమో పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సు అత్యంత ఉత్తమమైనది. ఈ కోర్సు చేయడం మూలాన ఇటు డబ్బు, సమయం రెండూ వృథా కాకుండా సాంకేతిక విద్యను పొందవచ్చు. పారిశ్రామిక రంగంలో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యత లభిస్తుంది. 

మూడేళ్ల కోర్సులు : సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్, ఐప్లెడ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ) ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్

మూడున్నరేళ్ల కోర్సులు : మెటలార్జికల్, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ ఫుట్‌వేర్ టెక్నాలజీ. 

ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లమో కోర్సులు ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యునికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్. 
టీఎస్‌ఆర్‌జేసీ విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం రాష్ట్ర గురుకుల విద్యాలయాలను 1972లో ప్రారంభించింది. పట్టణాలకు, నగరాలకు దూరంగా ఎటువంటి ప్రతిబంధకాలు లేని ప్రాతాల్లో ప్రత్యేక సదుపాయాలు విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పని చేస్తున్నాయి. ఈ మేరకు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో గురుకుల విద్యాలయాలకు పెరుగుతుంది. చేరడానికి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సొసైటీ ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తోంది. నాణ్యమైన విద్య 

సదుపాయాలు రెండేళ్లపాటు ఉచిత విద్య, ఇంటిగ్రేటెడ్ ఎంసెట్ కోచింగ్, ఇంటెన్సివ్ టెస్టింగ్ ప్రోగ్రాం, ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ, (ఈఈటీ-ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సీజీడీఎం-కమర్షియల్ గార్మెంట్ డిజైన్ మేకింగ్), ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల వరకు నగదు బహుమతి అందజేస్తున్నారు.

ఐటీఐ : ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు ఒకటి, రెండేళ్ల కాల వ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ తక్కువ వ్యయంతోనే. దీని వల్ల చిన్న వయస్సులోనే ఉపాధి పొందే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలో ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. tenth class ఒకటి రెండేళ్లపాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు. కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించడం, మానవ వనరుల నైపుణ్యాలను పెంచి పరిశ్రమలకు అందించడం దీని లక్ష్యం. క్రాప్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం (సీటీఎస్) కింద 1950లో ఐటీఐలను స్థాపించారు. 14 నుంచి 40ఏళ్ల మధ్య వయస్కులు ఐటీఐల్లో శిక్షణ పొందవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (ఎన్‌సీవీటీ) అందిస్తుంది. ఈ సర్టిఫికెట్ ఉన్నవారికే ప్రైవేటు సంస్థలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

ప్రవేశం కోసం 10th class ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుం ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. 

SSCతో ఉద్యోగావకాశాలు : 
పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. Tenth తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్థోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. 20ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలో ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందవచ్చు.

సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ పోలీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సీపీఓ (భద్రతా విభాగం)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో ప్రధానంగా ఐదు విభాగాలు ఉంటాయి. 

ఎంపిక విధానం ఈ ఎంపిక మూడు దశలుగా జరుగుతుంది. మెదటి దశ శారీరక సామర్థ్యం పరీక్ష. దీంట్లో పరుగు పందెం, హైజంప్ రెండో దశ రాత పరీక్షకు సంబంధించింది. మొదటి పరీక్షల్లో అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో జనరల్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు. మొదటి, రెండవ నెగ్గిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

అర్హత : 10th class ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయస్సు 18నుంచి 23సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతి చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.

త్రివిధ దళాలు దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. 10th class ఆపై అర్హతలు ఉన్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటాయి.

ఇండియన్ ఆర్మీ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నిమిత్తం ప్రకటనలు జారీ చేస్తుంది. జిల్లా ప్రధాన కేంద్రాలు, పట్టణాల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంది. ఆర్మీ పోస్టుల్లో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండేవి సోల్జర్లు (జనరల్ డ్యూటీ).

అర్హత : కనీసం 45శాతం మార్కులతో 10th class ఉత్తీర్ణులై ఉండాలి. 18నుంచి 21సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులు.

ఎంపిక : కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహించి ఎంపిక చేస్తారు. దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయి. వాటిలో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి చేస్తారు. 
ఎయిర్ ఫోర్స్ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) 10th class ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌మెన్ (మ్యుజీషియన్) ఉద్యోగాలను కల్పిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఇది గ్రూప్-వై ట్రేడ్‌కు చెందింది. 

అర్హత కనీసం 45శాతం results తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 25సంవత్సరాలవారు అర్హులు. గిటార్, క్లారినెట్, వయోలిన్ లేదా ఇతర సంగీత వాయిధ్య పరికరాల ఘౌపయోగం తెలిసి ఉండాలి. శారీరక ప్రమాణాల్లో భాగంగా ఛాతి సాధారణ స్థితిలో157 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 80సెం.మీ. ఉండాలి. 

ఎంపిక ఇలా. మొదట రాత పరీక్ష, తరువాత శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు జరిపి ఎంపిక చేస్తారు. 
ఇండియన్ నేవీ భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) 10th class ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలు అందిస్తోంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఇందులో కుక్స్ కోసం ఆహార పదార్థాలు తయారు చేయగలిగేవారు. స్టీవార్డ్స్ కోసం ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. 

ఇంకా ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, టీఎన్‌పీఎస్సీ, అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ అధికారి, బంగ్లా వాచర్, ఠాగేదార్ పోస్టులకు 10th class అర్హత సరిపోతుంది.

0 comments:

Post a Comment