తొంబై శాతం మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేది దీనిలోనే.
ఇంటర్ రెండేళ్ల కోర్సు. దీనిలో పలు గ్రూప్లు ఉంటాయి. ప్రధానంగా ఎంసెట్ కల్చర్ రాజ్యమేలుతున్న ఈ రెండు దశాబ్దాలుగా ఇంటర్లో ఎంపీసీ లేదా బైపీసీ కోర్సుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో కామర్స్ గ్రూప్లపై కార్పొరేట్ కన్ను పడటం. అదేవిధంగా మారిన ప్రపంచ నేపథ్యంలో ఎంఈసీ, సీఈసీ గ్రూప్లకు కొంత డిమాండ్ పెరిగింది.students01సీఏ, కంపెనీ సెక్రటరీ తదితర ఉన్నత హోదాగల ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ నుంచి సాధారణ కంపెనీల వరకు ఆడిటింగ్ డిపార్ట్మెంట్స్ ఏర్పాటుతో మంచి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో కామర్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే హెచ్ఈసీ వైపు ఈ మధ్య మొగ్గుచూపుతున్నారు. సివిల్స్, గ్రూప్స్లకు ఇంటర్లోనే పునాదులు వేసుకునేందకు సోషల్వైపు దృష్టిసారిస్తున్నారు.
0 comments:
Post a Comment